జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ గీసుగొండ మండలం, ఎలుకుర్తి హవేలీ గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆయుర్వేద వైద్యశాల డాక్టర్లు వృద్దులకు ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. బిపి, షుగర్, కీళ్లనొప్పులు, నడుము నొప్పి, అజీర్ణం, ఆర్ష మొలలు తదితర వైద్య పరీక్షలు నిర్వహించి 130 మందికి ఉచితంగా మందుల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి వైద్యులు, ఎలుకుర్తి హవేలీ వైద్యాధికారి డాక్టర్ మైదం రాజు, లక్ష్మిపురం వైద్యాధికారి డాక్టర్ సహజ, అమీనాబాద్ వైద్యాధికారి డాక్టర్ పర్వీన్, వరంగల్ జిల్లా ప్రోగ్రాము ఆఫీసర్ గాదర్ల రాజు, ఫార్మసిస్ట్ లు భాస్కర్, ప్రియాంక, సజయ్, సబ్ సెంటర్ వైద్యులు, ఆశ కార్యకర్తలు కార్యదర్శి నరేష్, జూనియర్ వెటర్నరీ అధికారి సతీష్, శంకర్, తదితర సిబ్బంది పాల్గొన్నారు.
