Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గవర్నర్ సమావేశంలో పాల్గొన్న ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్!

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 28
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా హనుమకొండ కలెక్టర్ కార్యాలయంలో జిల్లాలోని ప్రముఖులతో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా జాతీయ రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుంకరి జ్యోతితో గవర్నర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అనేక అవార్డులను గెలుచుకునే విధంగా కృషి చేయాలని సూచించారు. ఎంతో కష్టపడితే గాని జాతీయస్థాయిలో అవార్డు అందుకోలేరని, సామాజిక సేవలో నిరంతరం కొనసాగాలని విద్యార్థులను, యువతను జాతీయ సేవకు సన్నద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, హనుమకొండ, వరంగల్ కలెక్టర్ తో పాటు అధికారులు పాల్గొన్నారు.

Related posts

చల్లా ధర్మారెడ్డి వెంటే హౌజ్ బుజుర్గ్ గ్రామస్థుల

Jaibharath News

ఎల్లప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటా డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ జిల్లాలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన.