జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ఆగస్టు 29 ..నిషేధిత సి.పి.ఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఏరియా కమిటీ సభ్యుడు, సెంట్రల్ కమిటీ సభ్యులు కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహయకుడిగా పనిచేసిన బుజగుండ్ల అనిల్ ఆలియాస్ క్రాంతికిరణ్ వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఎదుట గురువారం లొంగిపోయాడు.ఈ లొంగుబాటుకు సంబంధించి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వివరాలు వెల్లడిస్తూ వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, ఆర్షనపల్లి గ్రామానికి చెందిన ఆనిల్ అలియాస్ క్రాంతి కిరణ్ తల్లిదండ్రులు ఇద్దరు కూడా గతంలో అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్లో పనిచేసిన ఇరువురు మరణించడంతో అనిల్ ను తాతయ్య, నాయనామ్మలే పెంచారు. చివరి సంవత్సరం చదువుతున్న సమయంలో మావోయిస్టు పార్టీ సంబంధించిన విద్యార్థి విభాగానికి ఆనిల్ హైదారాబాద్లో ఎల్.ఎల్.బి. చివర సంవత్సరం చదువుతున్న సమయంలో మావోయిస్టు అనుబంధ సంస్థయిన డి.ఎస్ఈయు విభాగంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు అధ్యక్షుడిగా పనిచేసాడు. ఇదే సమయంలో అనిల్ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బడే చొక్కరావు ప్రోత్సహంతో 2021 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. పార్టీలో చేరిన మావోయిస్టు అనిల్ కొద్ది రోజులు కేంద్ర కమిటీ సభ్యులు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న, కటకం సుదర్శన్ అలియాస్ అనంద్ ల వద్ద వ్యక్తిగత సహయకుడిగా పనిచేసాడు. అనంతరం 2023 సంవత్సరంలో పార్టీ ఆదేశాల మేరకు ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం మడ్ ఏరియా కమిటీ సభ్యుడుగా బాధ్యతలు చేపట్టాడు. ఇదే సమయంలో అనిల్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, సెంట్రల్ రిజినల్ బ్యూరోకార్యదర్శి మల్లోజుల వేణుగోపాల్, అలియాస్ సోను అధ్వర్యంలో మావోయిస్టు పార్టీ ప్రచార కర్తగా కూడా 2023 నవంబర్ వరకు పనిచేసాడు. చివరగా మావోయిస్టు పార్టీ నాయకత్వం ప్రస్తుత సంవత్సరం జులై మాసంలో అనిల్ ను తెలంగాణ రాష్ట్ర కమీటీలో ఏరియా కమిటీ సభ్యుడిగా నియమించింది. ఇదే సమయంలో గత జులై మాసం 19వ తేదిన బీజాపూర్ జిల్లా పరిధిలోని సిమలదొడ్డి గ్రామ ఆటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో అనిల్ ప్రత్యక్షంగా పాల్గొన్నాడు. ఈ ఎదురుకాల్పుల్లో మవోయిస్టు దులా మరణించాడు. దీంతో గత జులై చివరి వారంలో అనిల్ తిరిగి మరోమారు మావోయిస్టు పార్టీ మరోమారు కేంద్ర కమిటీ సభ్యులైన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ మరియు మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ అభయ్ అలియాస్ సోను దాదాల వ్యక్తిగత సహాయకుడిగా వారి ల్యాప్టాప్ు ఉపయోగిస్తూ అగ్రనేతల ఆదేశాల మేరకు మావోయిస్టు పార్టీకి సంబంధించిన పత్రికల్లో కథనాలు, వ్యాసాలు, వీడియోలు, ఇంటర్నెట్ అనుబంధ కార్యకలపాలు నిర్వహించేవాడు.మావోయిస్టు పార్టీలో రెండు సంవత్సరాలకు పైగా పనిచేసిన అనిల్ గత కొద్ది రోజులుగా నరాలకు సంబంధించిన వ్యాధి సమస్యతో పాటు మావోయిస్టు పార్టీకి ప్రజల నుండి ఎదురౌవుతున్న వ్యతిరేక అలాగే ప్రభుత్వం అందిస్తున్న పునరావాస పథకాలకు ఆకర్షితుడై జనజీవన స్రవంతి కలిసేందుకు పోలీసుల ఎదుట లోంచి పొవడం జరిగింది. లొంగిన పోయిన మావోయిస్టు సభ్యుడు అనిల్ పై ప్రభుత్వం నాలుగు లక్షల రూపాయల రివార్డ్ ప్రకటించారని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ తెలిపారు
