*బీసీ డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం*
హైదరాబాద్జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 హైదరాబాద్ ప్రతినిధి:-బి.సి. డిమాండ్ల సాధనకై హైదరాబాద్ హోటల్ సెంట్రల్ కోర్టులో అఖిలపక్ష సమావేశం. హాజరైన బీసీ సంక్షేమం సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మాజీ స్పీకర్ ఎమ్మెల్సీ మధుసూధన చారి, ఎమ్మెల్సీ ఎల్ రమణ, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, మాజీ రాజ్యసభ సభ్యులు వి హనుమంతరావు, బీసీ జనసభ అధ్యక్షుడు రాజారాం, తెలంగాణ ముదిరాజ్ సమాజ్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు దారం యువరాజ్ ముదిరాజ్ వివిధ బీసీ సంఘాల నాయకులు.డిమాండ్స్: హాజరైన వివిధ పార్టీలు, బీసీ సంఘాల నాయకులు.పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశం పెట్టాలి. జాతీయ స్థాయిలో కులగణన చేపట్టాలి.రాబోయే పంచాయితీ ఎన్నికలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి.