జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 వరంగల్ ప్రతినిధి:-
హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలసిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికార్యక్రమాలు పట్ల ముఖ్యమంత్రి ఆరాతీశారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరారు.కాళోజీ కళాక్షేత్రం,నయిమ్ నగర్ బ్రిడ్జి నిర్మాణ పనుల పురోగతిని అడిగిన ముఖ్యమంత్రి.ఈ సందర్భంలో హనుమకొండ వాస్తవ్యులు డా,, తిరుణహరి శేషు ప్రభుత్వ పనితీరు,విధివిధానాల రూపకల్పనలో ఉన్నముఖ్య అంశాలపై34ఆర్టికల్స్ తో రాసిన కృషివలుడు పుస్తకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికిఅందించారు.
