Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

శాయంపేటలో అంగరంగ వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన

*శాయంపేటలో అంగరంగ వైభవంగా హనుమాన్ నగర సంకీర్తన* హన్మకొండ జిల్లా//శాయంపేట జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 31 పరకాల ప్రతినిధి:-

శాయంపేట మండల కేంద్రంలోని అతి పురాతనమైన ఆరు శతాబ్దాలు చరిత్ర గలిగిన శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయంలో శ్రావణమాస చివరి శనివారం పురస్కరించుకుని ఈరోజు దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి ఆధ్వర్యంలో నగర సంకీర్తన గ్రామ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా నిర్వహించినారు మొదట దేవాలయంలో దేవాలయ అర్చకులు ఆరుట్ల కృష్ణమాచార్యులు వి మణికంఠ ప్రత్యేక పూజలు నిర్వహించారు పత్తిపాక హనుమాన్ భజన మండలి వారిచే శ్రావణమాసం పురస్కరించుకుని నెలరోజుల పాటు వివిధ గ్రామాలలో నగర సంకీర్తన చేసుకుంటూ 29 వ రోజు శాయంపేట గ్రామము చేరుకున్నారు వారు భక్తి పాటలతో భజనలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరిగారు ఈ కార్యక్రమంలో గిద్దమారి సురేష్ మాందాటి రాజు తడుక సదానందం నీల రంగారెడ్డి అనుకారి శివ అంకేశ్వరం మొగిలి గజ్జి మహేందర్ చల్లా రవీందర్ రెడ్డి పింగిలి రాంరెడ్డి మాచర్ల వెంకటేష్ కుసుమ రమేష్ నాలిక వెంకటేష్ పొట్టకారి వికాస్ ముల్కనూర్ సంజయ్ తుడుం రమేష్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

అధికారుల పై దాడి చేసిన దోషులను కఠినంగా శిక్షించాలి

సన్న బియ్యం పంపిణీ దేశానికి ఆదర్శం మంత్రి కొండా సురేఖ

డాక్టర్ మధుసూదన్ కు అభినందనలు

Jaibharath News