Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి

*ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి* మహబూబాబాదు జిల్లా// కొత్తగూడ జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:

-ఇందుమూలముగా కొత్తగూడ మండలం ప్రజలకు తెలియజేయునది ఏమనగా మూడు రోజుల నుండి ఏడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు, మరో మూడు రోజులు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడ ఎస్ఐ తెలియజేశారు. గ్రామంలో వర్షానికి పాత ఇండ్లు మట్టి, గోడలు కూలి అవకాశం ఉన్నది కావున అలాంటి ఇల్లు కూలి పరిస్థితిలో ఉంటే వారు గ్రామపంచాయతీని సంప్రదించగలరు. మరియు గ్రామంలో ఇంటి నుంచి బయటికి వెళ్లినప్పుడు కరెంటు స్తంభాలను తాకరాదు. ఇట్టి వర్షానికి కరెంటు షాక్ రావడం జరుగుతుంది. మరియు మీ ఇంటి వద్ద బట్టలు ఆరేసే ఇనుప తీగపై బట్టలు ఆరవేయరాదు, ఎందుకనగా ఈ వర్షానికి కరెంట్ షాక్ వస్తుంది. కావున తగు జాగ్రత్తలు తీసుకోగలరు మీ యొక్క చిన్న పిల్లలను ఇంటి నుండి బయటకు పంపించరాదు. మీయొక్క ఇంటి పరిసర ప్రాంతాలలో పరిశుభ్రంగా ఉంచుకొని రోగాల బారిన పడకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు.

Related posts

గాంధీ జయంతి వేడుకలు

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

ఉపాధి కల్పనకు సత్వర చర్యలు చేపట్టాలి-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి