*భారీ వర్షంలో తిరుగుతూ ప్రజలను అప్రమత్తం చేస్తున్న వరంగల్ పోలీస్ కమిషనర్.*
వరంగల్//నెక్కొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఐపిఎస్ తీసుకుంటున్న ముందస్తూ జాగ్రత్త చర్యల్లో భాగంగా పోలీస్ కమీషనర్ భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తన సిబ్బందితో కల్సి నెక్కొండ మండల కేంద్రంలో నెక్కొండ వెంకటాపూర్ మార్గంపై నెక్కొండ చెరువు తీవ్ర స్థాయిలో ప్రవహిస్తుండంతో పోలీస్ కమిషనర్ ఈ ప్రాంతానికి చేరుకొని వాహనాల రాకపోకలపై వాహనదారులను అప్రమత్తం చేశారు. పోలీస్ కమిషనర్ స్థాయి అధికారి క్షేత్ర స్థాయిలో ప్రజలను అప్రమత్తం చేయడంతో ప్రజలు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.