*ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు*
వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//పోతరాజుపల్లి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-
పోతరాజు పల్లి చెరువు మత్తడి పోయడంతో బొడ్డు చింతలపల్లి పోతరాజు పల్లి గ్రామాల మధ్య గల కాజ్ వే పైనుండి వరద నీరు పోతుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణాలు ప్రస్తుతం చేయొద్దని అధికారులు ప్రకటించారు. ధర్మారం నుండి పోతరాజుపల్లి, బొడ్డు చింతల పల్లి, ముస్త్యాల పల్లి, తక్కల్లపాడు ద్వారా ఒగ్లాపూర్ కి ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.