*శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానం, రామాలయంలలో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు*
హన్మకొండ జిల్లా//పరకాల
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 పరకాల ప్రతినిధి:-
పరకాల పట్టణంలోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి దేవస్థానంలోనూ, రామాలయంలోను ఆదివారం తన జన్మదినం సందర్భంగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్ఛారణలచే దేవతలకు అర్చనలు అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం శ్రీ భవాని కుంకుమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఎమ్మెల్యే దంపతులు అన్నదాన కార్యక్రమం నిర్వహించి వచ్చిన భక్తులకు స్వయంగా వడ్డించి అన్నదానం చేశారు. వారితో కలిసి భోజనం చేశారు.