Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కటాక్షపురం మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాం -మంత్రి సీతక్క

అధికారులు అప్రమత్తంగా ఉండాలి

-కటాక్షపురం మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేయిస్తాం
-మంత్రి సీతక్క

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
జాతీయ రహదారిపై ఉన్న కటాక్షపురం మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి త్వరగా పూర్త య్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలం కటాక్షపురం జాతీయ రహదారిని అనుకుని ఉన్న పెద్ద చెరువు మత్తడిని అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జాతీయ రహదారి 163 పైన ఉన్న కటాక్షపురం పెద్ద చెరువు మత్తడి పై హై లెవెల్ బ్రిడ్జి వెంటనే నిర్మాణం పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. వాహనదారులకు ప్రమాదాలు జరగకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు. అన్ని శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలన్నారు. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రజలను అప్రమత్తం చేస్తూ వర్షాలకు ఎవరి ఇబ్బందులు పడకుండా చూడాలని అన్నారు. మంత్రి సీతక్క తో అధికారులు జగన్మోహన్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి ఎంపీటీసీ ల పోరం మాజీ మండల అధ్యక్షులు ఆర్షం వరుణ్ గాంధీ తో పాటు కాంగ్రెస్ జిల్లా నాయకులు హర్షం అశోక్, పొనుగోటి కోటి, గఫూర్, ఆర్షం రాజ కుమార్, కాడబోయిన రవి యాదవ్, కాడబోయిన రాజ్ కుమార్, హల్వాల రవి, తదితరులు ఉన్నారు

Related posts

గీసుకొండ హైస్కూల్ లో ఘనంగా SSC 2007-08 బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

ఎమ్మెల్యే  ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలి

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి