Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి జాక్ చైర్మన్ గజ్జెల రామ్ కిషన్

తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంయుక్త కార్యాచరణ సమితి వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో ఏకశిలా పార్కు నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భారీ నిరసన ర్యాలీ ఆదివారం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జేఏసీ భాగస్వామ్య సంఘాలు పాల్గొని ముక్తకంఠంతో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని నినాదించడం జరిగింది.
ఈ సందర్భంగా వరంగల్ జేఏసీ చైర్మన్ గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ 2004లో ప్రారంభమైన కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించి ,సిపిఎస్ ఉద్యోగ బాధితులకు న్యాయం చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
సిపిఎస్ రద్దు చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని, రాబోయే రోజులలో ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో టిఎన్జీవోస్ జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమానాయక్, జిల్లా బాధ్యులు సిపిఎస్ ఎంప్లాయిస్ యూనియన్, నాయకులు కందుల జీవన్ , వెంకటస్వామి, వరంగల్ జిల్లా అధ్యక్షులు రవీందర్రావు,టీజీవోస్ మురళీధర్ రెడ్డి, డిటిఎఫ్ నాయకులు గోవిందరావు, తెలంగాణ పిఆర్టియు నాయకులు శ్రీనివాస్, తెలంగాణ యు టి ఎఫ్, థామస్ ,పి ఆర్ టి యు, లక్ష్మణ్, శ్రీనివాస్, టిఎస్ యుటిఎఫ్ తాటికాయల కుమార్, సుజన్ నామోజు శ్రీనివాస్,టిపి టిఎఫ్ కడారి భోగేశ్వర్, మనోజ్, యస్ టి యు నాయకులు నాగరాజు తదితర ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts

కిక్ బాక్సింగ్ కోచింగ్ లో ఉత్తమ ఫలితాలను సాధించాలి. వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు

Sambasivarao

ఇస్రో కోఆర్డినేటర్లుగా జితేందర్, సరిత నియామకం!

తొలకరి జల్లులకు.. వ్యాధులు సోకుతాయిహనుమకొండ జిల్లా డిప్యూటీ డి ఎం హెచ్ ఓ యాకూబ్ పాషా