Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ రిటైర్డ్ ప్రొఫెసర్ భద్రునాయక్ మృతి*

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 యూనివర్సిటీ ప్రతినిధి:-ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ భద్రు నాయక్ కన్నుమూశారు. అతని భౌతిక దేహానికి పూలమాలవేసి సంతాపం తెలియజేస్తున్న రిజిస్టర్ మల్లారెడ్డి. కాకతీయ యూనివర్సిటీ మాజీ చరిత్ర విభాగాధిపతి, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుగులోతు భద్రు నాయక్ కన్నుమూశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో సామాజిక ఉద్యమకారులుగా అనేక జాతి ఉద్యమాలలో, హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నారు. ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకం వహించి ప్రోత్సాహించారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన భద్రు నాయక్ అకస్మిక మృతి పట్ల చింతిస్తూ ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి పలువురు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులకు పలువురు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. సంతాపం తెలియజేసిన దాంట్లో ప్రొఫెసర్ సురేష్ లాల్ ప్రొఫెసర్ హనుమంతు నాయక్ ప్రొఫెసర్ సమ్మయ్య వివిధ గిరిజన సంఘాలు ప్రజా సంఘాల నాయకులు బద్రి నాయక్ కి సంతాపం తెలియజేశారు.

Related posts

మడికొండ టెక్స్ టైల్ పార్కులో గ్రీన్ టెక్నాలజీ ఆవిష్కరణ వర్క్ షాప్ కమ్ అడాప్షన్ ఎంపీ కడియం కావ్య

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి

శివాలయంలో  ఎమ్మెల్యే ధర్మారెడ్డి ప్రత్యేక పూజలు