జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-
మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీన గత రెండురోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి నాగయ్య పల్లి & మనుగొండ ప్రధాన రహదారిని మరియు ఎప్పటినుండో కోతకు గురవుతున్నటువంటి మండలంలోనే పెద్ద చెరువైనటువంటి మనుగొండ గ్రామ నరసింహచెరువు కట్టని పరిశీలించి మరమ్మత్తుల కోసం తగు ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్ మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, మండల పార్టీ ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.