*ధర్మారంలోని అలహాబాద్ బ్యాంక్ ముందు రైతులు నిరసన*
తెలంగాణ బీసీ ప్రజా సంఘం
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-
రుణమాఫీ కానీ రైతులను గుర్తించి వారికి వెంటనే రుణమాఫీ మంజూరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి.
ధర్మారం రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమంలో పాల్గొన తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాయిని భరత్ మాట్లాడుతూ.. 1293 మంది రైతులు రుణమాఫీ తీసుకోగా కేవలం 270 మంది రైతులకు రుణమాఫీ జరగడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపి ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ అయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నట్లు భరత్ అన్నారు అదేవిధంగా రైతుల పట్ల బ్యాంకు అధికారులు కొంతమంది నిర్లక్ష్యం వ్యవహరిస్తూ మాట్లాడడం సరైన పద్ధతి కాదని భరత్ అన్నారు అన్నం పెట్టే రైతులతో ప్రేమగా వ్యవహరించి ప్రతి ఒక్క విషయం వారికి క్షుణ్ణంగా వివరించే విధంగా అధికారులు పనిచేయాలని భరత్ అన్నాను కార్యక్రమంలో ధర్మారం రైతులు తదితరులు పాల్గొన్నారు.