Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఏలాంటి ఆపద సమయాల్లోనైనా కొండా దంపతుల ఇంటి తలుపులు ఎల్లవేళలా తెరిచే ఉంటాయి

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 హనుమకొండ ప్రతినిధి:-
హనుమకొండ రాంనగర్ లోని కొండా దంపతుల క్యాంప్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ప్రజల నుంచి విజ్ఞప్తులను వినతులను స్వీకరిస్తు ప్రజల సమస్యలను సావధానంగా వింటూ సంబంధిత శాఖల అధికారులతో అప్పటికప్పుడే ఫోన్ లో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు. దీర్ఘకాలంగా వేచి చూస్తున్న తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంతో ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ఆపద సమయాల్లోనైనా ప్రజలకు ఎల్లవేళలా కొండా దంపతులు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని కొండా మురళీధర్ రావు తెలిపారు. ఏ సమస్యలున్నా ప్రజలు ఎలాంటి పైరవీలు చేయకుండా నిరభ్యంతరంగా తనను సంప్రదించవచ్చునని కార్యకర్తలకు నాయకులకు ఏ ఆపద వచ్చిన కొండా దంపతులు కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఈ సందర్భంగా కొండా మురళీధర్ రావు ప్రజలకు మరోసారి స్పష్టం చేశారు.

Related posts

కేయూ భూములపై పారదర్శనంగా సమగ్ర విచారణ చేపట్టాలి బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం నాయకులు

కాజీపేట దర్గా ఉత్సవాలలో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

చైర్స్ పంపిణీ చేసిన ఆర్,ఐ కాలువల శ్రీనివాస్

Jaibharath News