జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ జిల్లా ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా భారీ వర్షాల దెబ్బతిన్న సిరోలు మండలంలోని పురుషోత్తమాయగూడెం, సీతారాంపురం గ్రామాలను, నెల్లికుదురు మండలంలోని రావిరాల గ్రామాలలో సీఎం రేవంత్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులతో పర్యటించి పరిశీలించిన అనంతరం వరద నష్టంపై మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవనంలో జరిగిన సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ప్రభుత్వం బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేస్తుందని సీఎం తెలిపారు. వరద ప్రభావం తగ్గిన అనంతరం విష జ్వరాలు ప్రభలే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, స్థానిక ఎమ్మెల్యేలు మురళి నాయక్, జాటోత్ రాంచంద్ర నాయక్, ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు యశస్విని రెడ్డి, గండ్ర సత్యనారాయణ, కలెక్టర్, ఎమ్మెల్సీ చింతపండు నవీన్ (మల్లన్న), ఎస్పీ, ఉన్నత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

previous post
next post