Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఖమ్మం జిల్లా

వరద బాధితుల కోసం నెల వేతనం విరాళం. దాతృత్వం చాటుకున్న..ఎంపీ వద్దిరాజు రవిచంద్ర


జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వరంగల్ ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తన దాతృత్వాన్ని మరోసారి చాటుకున్నారు ఎంపీ రవిచంద్ర సోమ, మంగళవారాలు రెండు రోజులు ఖమ్మం మున్నేరు వరద బాధితులకు కొండంత అండగా నిలిచిన విషయం తెలిసిందే వరద ముంపునకు గురై తీవ్రంగా నష్టపోయిన, పుట్టెడు దుఃఖంతో ఉన్న వారిని ఆదుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశానుసారం తన ఒక నెల జీతాన్ని విరాళంగా ఇస్తున్నట్లు ఎంపీ వద్దిరాజు తెలిపారు.