జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 4 వరంగల్ ప్రతినిధి:-ఏకంగా తాహశీల్దార్ సంతకం ఫోర్జరీ చేసి ఇంటి నుండే నకిలీ సర్టిఫికెట్లు జారీ. వరంగల్ తహశీల్దార్ ఇక్బాల్ మట్ట్వాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో బయటపడ్డ నమ్మలేని నిజాలు. డబ్బులు ఇస్తే ఎ సర్టిఫికెట్ అయినా ఐదు నిమిషాల్లో తయారు చేస్తారు. ఇప్పటివరకు 8 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు. సర్టిఫికెట్ తయారు చేయడానికి సహకరించిన డిటిపి, స్టాంపు, సంతకం ఫోర్జరీ, దళారి ఇలా నలుగురు అరెస్ట్. నకిలీ సర్టిఫికెట్లు తీసుకున్న మరో నలుగురిని అరెస్టు చేసినట్లు విలేకరుల సమావేశంలో వెల్లడించిన వరంగల్ ఏసిపి నందిరాం నాయక్.

next post