Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండలంలో ఉచిత వైద్య శిబిరాలు

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 6)
గీసుకొండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  పరిధిలోని అన్ని గ్రామాలలో శుక్రవారం డ్రై డే కార్యక్రమం తో పాటు గంగాదేవిపల్లి, విశ్వనాధపురం, నందనాయక తండ, గ్రామాల యందు ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగినదని,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ దేవేందర్ తెలిపారు.ఇంటింటికి ఆశా కార్యకర్తలు గ్రామాల వైద్య సిబ్బంది ఫీవర్ సర్వేతో పాటు డ్రైడే కార్యక్రమాలు నిర్వహించడం జరిగినదని అన్నారు. నంద నాయక్ తండ గ్రామంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ సదానందం  39 మందికి  వైద్య పరీక్షలు నిర్వహించి, డెంగ్యూ మలేరియా కిట్ల ద్వారా నలుగురికి పరీక్షలు నిర్వహించి, ఉచితముగా మందులు పంపిణీ చేశారు. విశ్వనాధపురం గ్రామంలో నిర్వహించిన వైద్య శిబిరంలో స్థానిక వైద్యాధికారి డాక్టర్ జాబిల్లి గ్రామంలోని ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేయడం జరిగింది. ఈ శిబిరంలో 67 మందికి పరీక్షలు నిర్వహించడం జ్వరము వచ్చిన వారికి డెంగ్యూ మలేరియా కిట్లు ద్వారా 7 గురికి  రక్తనమోనాలు పరీక్షల ద్వారా  నిర్వహించారు. గంగాదేవిపల్లి గ్రామం నందు ఉచిత వైద్య శిబిరంలో  స్థానిక వైద్యాధికారి డాక్టర్ మమత  46 మందికి పరీక్షలు చేసి ఉచితముగా మందులు ఇవ్వడం అయినది. ఈ శిబిరంలో జ్వరం వచ్చిన వారికి డెంగ్యూ మలేరియా కిట్ల ద్వారా 5 గురికి పరీక్షల ద్వారా రక్తనమోనాలు సేకరించడం జరిగింది. డెంగ్యూ మలేరియా కిట్టు ల ద్వారా పరీక్షల్లో ఏ ఒక్కరికి డెంగ్యూ కానీ మలేరియా కానీ లేదని తెలియజేశారు. ఈ ఉచిత వైద్య శిబిరాలల్లో డాక్టర్ జాబిలి, డాక్టర్ మమత, సి హెచ్ ఓ మధుసూదన్ రెడ్డి, ఏఎన్ఎంలు రత్నవల్లి, సదాలక్ష్మి,సుహాసిని, కల్పన, రూతు, హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారని తెలిపారు


Related posts

వరంగల్ లో ఇన్నర్ రింగ్ రోడ్ భునిర్వాసితుల ఆందోళన

బాల కొమురవెల్లి  హనుమాన్ గురుస్వామిఅధ్వర్యంలో మాలలు విరమణ

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News