Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని*

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-

మట్టి గణపతులతో ఈ నవరాత్రి ఉత్సవాలు మరింత భక్తి శ్రద్దలతో కొనసాగాలని కోరిన ఎమ్మెల్యే. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని.కుల, మతాలకు అతీతంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో 9 రోజులు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అందరికీ మంచి జరగాలని, విజ్ఞాలు లేకుండా ఆ విజ్ఞానాథుడు చూడాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ మరియు తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు హనుమకొండ ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం)లో మట్టి గణపతి లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

నిర్బంధాలతో బీ.ఆర్.ఎస్ కార్యకర్తల్ని అణచలేరు

తెలంగాణ  పిసిసి అధ్యక్ష పదవి ఎంపి బలరాం నాయక్ కు ఇవ్వాలి

డిఆర్డిఓ సంపత్ రావు మచ్చాపూర్ గ్రామంలో సందర్శించారు