Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని

*ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మట్టి గణపతులను పంపిణి చేసిన ఎమ్మెల్యే నాయిని*

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-

మట్టి గణపతులతో ఈ నవరాత్రి ఉత్సవాలు మరింత భక్తి శ్రద్దలతో కొనసాగాలని కోరిన ఎమ్మెల్యే. పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే నాయిని.కుల, మతాలకు అతీతంగా చిన్న పెద్ద అందరూ కలిసి ఎంతో భక్తి శ్రద్దలతో 9 రోజులు నిర్వహించే గణపతి నవరాత్రి ఉత్సవాల్లో అందరికీ మంచి జరగాలని, విజ్ఞాలు లేకుండా ఆ విజ్ఞానాథుడు చూడాలని హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కోరుకున్నారు. వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గ మరియు తెలంగాణ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు హనుమకొండ ప్రజా భవన్ (ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం)లో మట్టి గణపతి లను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజించాలని తద్వారా పర్యావరణ పరిరక్షణలో అందరం భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.

Related posts

పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని – ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్

పేద ప్రజల అభ్యున్నతే కొండా దంపతుల లక్ష్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం