*హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్*
హన్మకొండ
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-
హనుమకొండ చౌరస్తా లష్కర్ బజార్ లో ఇటీవల ఒక గుర్తు తెలియని మృతదేహంని ముట్టుకునే విధంగా లేకపోవటంతో ఎవరు ముందుకు రాకపోగా హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చోరవతో కానిస్టేబుల్ రమణాకర్ మృతదేహాన్ని ఎంజీఎంకి అంబులెన్స్ లో తరలించి వారి మానవత్వం చాటుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారిని కలిసి అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీపక్ రెడ్డి, కౌటిల్ రెడ్డి, రజినీకాంత్, పాల్గోనడం జరిగింది.