జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వరంగల్ ప్రతినిధి:- పారాఒలింపిక్స్ లో కాంస్యం గెలుచుకున్న వర్ధన్నపేట నియోజక వర్గానికి చెందిన నిరుపేద క్రీడాకారిణి అథ్లెట్ దీప్తి జీవాంజికి గ్రూప్ -2 ఉద్యోగం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి గీసుగొండ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వంలో క్రీడాకారులకు సముచిత గౌరవం, ప్రాధాన్యత ఉంటుందని అనడానికి ఇదే నిదర్శనం అన్నారు నిరుపేద కుటుంబానికి చెందిన దీప్తికి కోటి రూపాయల నజరానాతో పాటు గ్రూపు -2 ఉద్యోగం కల్పిస్తూ, వరంగల్ జిల్లాలో 500 గజాల స్థలాన్ని అందించిన సీఎం రేవంత్ రెడ్డికి గీసుగొండ ప్రజల పక్షాన, గీసుగొండ క్రీడాకారుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు.

previous post