*ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టలు సందర్శన*
వరంగల్ జిల్లా//పర్వతగిరి
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 వర్ధన్నపేట ప్రతినిధి:-
భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో ఎస్సీ హాస్టల్ సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయడం జరిగింది అనంతరం ఎస్ఎఫ్ఐ పర్వతగిరి మండల కమిటీ సమావేశం ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి ఎద్దు రాహుల్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుక్క ప్రశాంత్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి వ్యవహరిస్తున్న ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు అదేవిధంగా విద్యార్థుల దగ్గర నుండి ఫీజులు ముక్కు పిండి మరియు వసూలు చేస్తున్నారు తల్లిదండ్రులకు చెప్పకుండా విద్యార్థులను ఫీజుల విషయంలో అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ ఆట స్థలము విద్యార్థులకు సరిపడా బాత్రూంలు లేకపోవడం మరియు ఎటువంటి బిఈడి అర్హత లేని ఇంటర్మీడియట్ వాళ్లతో చదువులు చెప్పించడం జరుగుతుంది కాబట్టి తక్షణమే వారి పైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ గర్ల్స్ కన్వీనర్ శ్రీజ ఎస్ఎఫ్ఐ నాయకులు కౌశిక్ అజయ్ అభిషేక్, అభినయ్, సిద్ధార్థ సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు.