జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 కరీంనగర్ ప్రతినిధి:-
కరీంనగర్ లో ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధిపై సమీక్షా సమావేశం రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్వహించారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, విజయ రమణరావు, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, ప్రపుల్ దేశాయ్, హాప్సిటల్ సూపరింటెండెంట్, అధికారులు. పాల్గొన్నారు ఆసుపత్రిలో ఉన్న దీర్ఘకాలిక సమస్యలు, వస్తున్న రోగులు, డాక్టర్ల సంఖ్య తదితర అంశాల పై చర్చ. హాస్పిటల్ లో రోగులకు ఇబ్బందులు లేకుండా వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు. ఆసుపత్రిలోఅవసరమైన ఏసీలు ఏర్పాటు చేసేందుకు సిఎస్ఆర్ ఎస్ డి ఎఫ్ నిధుల నుండి తాను, డ్రైనేజీ వ్యవస్థ మున్సిపల్ కమిషనర్, హాస్పిటల్ కు అవసరమైన పరికరాలు, మందులు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, అంబులెన్స్ రిపేర్ కి తక్షణ అవసరం కింద 9 లక్షలు జిల్లా కలెక్టర్ విడుదల చేస్తారని మంత్రి తెలిపారు

previous post