Jaibharathvoice.com | Telugu News App In Telangana
కరీంనగర్ జిల్లా

సినిగేయ రచయిత చంద్రబోస్, బలగంఫేం కొమురమ్మ, మొగిలయ్యలు అవార్డుకు ఎంపిక

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 కరీంనగర్ ప్రతినిధి:-పొన్నం సత్తయ్య గౌడ్ 3 వ మెమోరియల్ అవార్డుకు  ప్రముఖ సినిగేయ రచయిత ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, బలగంఫేం కొమురమ్మ, మొగిలయ్యలు.ఎంపికైనారు. రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య గౌడ్ జ్ఞాపకార్థం వారి సోదరులు కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం రచయితలకు, కళాకారులకు అందించే పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు – 2024 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత కళాకారులను ఎంపిక చేయడానికి జ్యూరి కమిటీ సమావేశం అయింది. జ్యూరి కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు సీనియర్ పాత్రికేయులు, మాజీ కేంద్ర సమాచార శాఖ కమిషనర్ మాడ భూషి శ్రీధర్, ప్రముఖ  సీనియర్ జర్నలిస్టు దిలీప్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రభాష సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, రచయిత్రి ఐనంపూడి లక్ష్మీలు సమావేశంలో పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం పొన్నం సత్తయ్య గౌడ్ మెమోరియల్ అవార్డు ఇస్తున్న మాదిరి ఈసారి కూడా కమిటీ పలువురు రచయితలు, కళాకారుల పేర్లను పరిశీలించింది. రచయితల విభాగంలో ప్రముఖ సినిగెయ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్, కళాకారుల విభాగంలో బలగంఫేం కొమురమ్మ మొగిలయ్యాలను అవార్డు గ్రహీతలుగా ఎంపిక చేశారు. ఎంపిక చేసిన పేర్లతో కూడిన పత్రాన్ని కమిటీ సభ్యులు మంత్రి పొన్నం ప్రభాకరుకి అందజేశారు. అవార్డు గ్రహీతలకు ఒక్కొకరికి 51 వేల రూపాయల నగదు, మెమోంటో తో సత్కరించ బడుతుందని కమిటీ కన్వీనర్ పొన్నం రవిచంద్ర తెలిపారు.అవార్డు గ్రహీతలకు ఈనెల 13 న పొన్నం సత్తయ్య గౌడ్ 13 వ వర్ధంతి సందర్భంగా రవీంద్ర భారతిలో సాయంత్రం 6 గంటలకు అవార్డులను ప్రధానం చేయనున్నారు. అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్య అతిథిగా శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విశిష్ట అతిధులుగా ఎక్సైజ్ అండ్ సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారు. గతంలో పొన్నం సత్తయ్య మెమోరియల్ అవార్డులో ప్రథమ సంవత్సరంలో రచయిత విభాగంలో నాళేశ్వరం శంకర్, కళాకారుల విభాగంలో ఒగ్గు కథ ధర్మయ్యలు, ద్వితీయ సంవత్సరం రచయిత విభాగంలో నెలిమాల భాస్కర్, కళాకారుల విభాగంలో ప్రముఖ గాయని విమలక్క ఈ అవార్డులను అందుకున్నారు.
ఈసారి రవీంద్ర భారతిలో పొన్నం సత్తయ్య గౌడ్ వర్ధంతి సందర్భంగా సాయంత్రం 6 గంటలకు జరిగే కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినట్లు కన్వీనర్ పొన్నం రవిచంద్ర పేర్కొన్నారు.
కార్యక్రమంలో రచయితలు కళాకారులు, మేదావులు పాల్గొననున్నారు.

Related posts

గంగధరలో రైతు సమ్మేళంనం

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు