భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వద్దన్నపేట ప్రతినిధి:-వర్షాలు పడుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రోగులు, రోగుల బంధువులు. మున్సిపాలిటీ అధికారులు ఆస్పత్రి ముందు డ్రైనేజీ నిర్మించక పోవడంతోనే ఈ సమస్య ఏర్పడిందని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి ఈ సమస్య గురించి తెలిపినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు. మున్సిపాలిటీగా మారినప్పటి నుండి కోట్లు ఖర్చుపెట్టీ అభివృద్ధి చేసినం అని చెప్పుకుంటున్న పాలకవర్గం అధికారులు. మరి ఈ సమస్య ఏంటని నిలదీస్తున్న పట్టణ ప్రజలు. వెంటనే మున్సిపల్ కమిషనర్ స్పందించి ఆస్పత్రి ఇరుపక్కల డ్రైనేజీ కాలువ నిర్మించి నీరునిలువ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని పట్టణ వాసులు, రోగులు డిమాండ్ చేస్తున్నారు.
