జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 10 కేయూ కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన భూములపై విచారణ జరపాలని, డబ్బాల వైపు భూములు ఆక్రమణకు గురయ్యాయని భారతరాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు విజిలెన్స్ అధికారులను కలిసి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ అధ్యక్షులు బైరపాక ప్రశాంత్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాచర్ల శరత్ చంద్ర మాట్లాడుతూ యూనివర్సిటీ భూముల పరిరక్షణ విషయమై విజిలెన్స్ వారు చేపట్టిన విచారణను పారదర్శకంగా జరగాలని కోరారు విజిలెన్స్ పై తమకు పూర్తి నమ్మకం ఉందని, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన పలివెల్పుల, లష్కర్ సింగారం సంబంధించిన భూముల సర్వేతో పాటు యూనివర్సిటీకి చెందిన అన్ని సర్వేనెంబరు చేపట్టాలని బీపీఈడీ హాస్టల్, డబ్బాల వైపు ఉన్న యూనివర్సిటీ భూమి ఆక్రమణకు గురైందని, కబ్జాకు గురైన భూముల్లో అనేక అక్రమ నిర్మాణాలు ఏర్పాడ్డాయని.. ఆయా కబ్జా, అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలపై ఎటువంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగకుండా విచారణ చేపట్టాలని కోరారు, వెంటనే అక్కడ సర్వే చేపట్టాలని, నగరంలో అత్యధికంగా విలువతో ఉన్న భూముల పైన కేయూ భూముల అని, ఎంతటి వారైనా ఉపేక్షిత రాదు అని, యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం తోనే కబ్జాలకు జరుగుతున్నాయని, గతంలో కేయూ భూముల పరిరక్షణ కోసం డా,,నాగేందర్ బాబు ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పడి. కాకతీయ విశ్వవిద్యాలయ భూములపై సర్వే చేయడం జరిగింది, అయితే ఆ రిపోర్డ్ను విజిలెన్స్ అధికారులు పరిగణలోకి తీసుకోగలరని కోరారు. కార్యక్రమంలో, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్ రాకేష్ యాదవ్, బిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు గొల్లపల్లివీర స్వామి, కండికొండ తిరుపతి, రత్నం అశోక్, తదితరులు పాల్గొన్నారు.
