*నర్సంపేటకు నర్సింగ్ కళాశాల మంజూరు*
వరంగల్ జిల్లా//నర్సంపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 నర్సంపేట ప్రతినిధి:-
మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల ఏర్పాటు నర్సింగ్ కళాశాల తరగతులను ఈ విద్యా సంవత్సరంలో ప్రారంభించాలి. మెడికల్ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలల పెండింగ్ పనులను పూర్తి చేసి విద్యా సంవత్సరం తరగతులను ప్రారంభించాలి. నర్సంపేట మాజీశాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నర్సంపేట నియోజక వర్గానికి గత ప్రభుత్వంలో గౌరవ తొలి ముఖ్య మంత్రివర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు సహకారంతో నర్సంపేట నియోజకవర్గంలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడమైనది మెడికల్ కళాశాలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాల కూడా మంజూరు కావడం జరిగింది. జిల్లా హాస్పిటల్ ని వేగంగా నిర్మించడంతో తద్వారా మెడికల్ నర్సింగ్ కళాశాల ఏర్పాటు సులువుగా జరిగింది. వైద్య రంగంలో నర్సంపేటను రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో నిలపడం జరిగింది. 183 కోట్ల నిధులతో పూర్తిస్థాయి అనుమతి మెడికల్ కళాశాలను మంజూరు చేయడం జరిగింది ఇప్పటికీ కొన్ని పనులు పెండింగ్లో ఉన్నవి గత పది నెలలుగా పనులు వేగవంతంగా జరగడం లేదు అధికారులు నిర్లక్ష్యం వహించకుండా పనులను త్వరగా పూర్తి చేయాలి. 100 సీట్లకు అనుమతితో మెడికల్ కళాశాలను మంజూరు చేయగా నేడు 50 సీట్లు కుదించడం దురదృష్టకరం. మెడికల్ మరియు నర్సింగ్ కళాశాల కోసం భవన నిర్మాణా లను వేగవంతం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకు రావాలి. మెడికల్ కళాశాల మౌలిక వసతులను మరియు బోధన బోధనేతర సిబ్బంది నియమాకం పారదర్శకంగా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం.