జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 13 నర్సంపేట ప్రతినిధి:-బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడి చేయడాన్ని నిరశిస్తూ. పోలీసులు ఏకపక్షoగా వ్యవహరిస్తూ మాజీ మంత్రి హరీష్ రావు పిలుపుతో బీఆర్ఎస్ పార్టీ ఛలో హైదరాబాద్ పిలుపు ఇవ్వడంతో. ముందస్తగా బీఆర్ఎస్ పార్టీ మండల సోషల్ మీడియా ఇంచార్జ్ బోడ మురళి నాయకును. బీఆర్ఎస్వి నియోజవర్గ నాయకులు సదిరం వినయ్ లను అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బోడ మురళి నాయక్ మాట్లాడుతూ. ప్రభుత్వం చేస్తున్న తప్పులను మరియు హామీల అమలు విషయంలో హరీష్ రావు మరియు పార్టీ నాయకులు నిలదీస్తే ఏంచేయాలో అర్థం కాని ప్రభుత్వం ప్రజల మధ్యలో ఓ సంవత్సరం కూడా పూర్తి చేసుకోక ముందే ప్రజల్లో తీవ వ్యతిరేకత ముట్టుకున్న విషయం తెలుసుకున్న రేవంత్ రెడ్డి ఈ విధంగా బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదని వారన్నారు. ప్రజాస్వామ్యం పద్ధతిలో శాంతియుత పోరాటాలు చేస్తామని, ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థం అయ్యావని అన్నారు. ప్రజా పాలన అంటే నిర్బంధాల అని ప్రశ్నించారు.

previous post