జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట
నల్లబెల్లి మండల అధ్యక్షులు బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన రుద్రగూడెం గ్రామంలో ఏర్పాటు చేసిన బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణా ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ మన దేశ అభివృద్ధి దిశగా వెళ్తుంది అంటే అది మన దేశ ప్రధాని నరేంద్ర మోడి వల్లనే, అనాయకునికి మద్దతుగా నిలిచి సభ్యత్వం పొంది, ప్రతి బూతులో బూత్ అధ్యక్షులు సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టాలనీ అన్నారు నర్సంపేట నియోజకవర్గ ప్రతి కార్యకర్త భాధ్యతయుతంగా సభ్యత్వ నమోదులు చెయ్యాలని కోరారు, గత 10 సంవత్సరాల నుండి నరేంద్ర మోడీ పాలన చూసి ప్రజలందరూ సభ్యత్వం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కంభంపాటి పుల్లారావు, నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ వడ్డేపల్లి నర్సింహ రాములు, జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్, అజ్మీరా శ్రీను, ఓబీసీ మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి గడ్డం ఆంజనేయులు, పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రామచంద్ర రెడ్డి, వరంగల్ జిల్లా కార్యదర్శి తడుక అశోక్, జిల్లా అధికార ప్రతినిధి మాల్యాల వినయ్, కునమల్ల పృధ్వీ, పంజాల రాము, మండల ప్రధాన కార్యదర్శి తడుక వినయ్ గౌడ్, జూలూరి మనీష్, ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు ఈర్ల నాగరాజు, రుద్రగూడెం గ్రామ బూత్ అధ్యక్షులు ఈర్ల రవి, యువమోర్చ అధ్యక్షులు గుగులోతు తిరుపతి మండల సీనియర్ నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు.
