Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఇతర మతాలను గౌరవిస్తూ పండుగలను జరుపుకుందాం. వరంగల్‌ సిపి అంబర్‌ కిషోర్‌ ఝా

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ సెప్టెంబర్ 15)
 ఇతర మతాలను గౌరవిస్తు సంతోషాల నడుమ పండుగలను నిర్వహించుకుందామని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో ఆదివారం  పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములో ట్రై సిటికి చెందిన ముస్లిం మత పెద్దలు, శాంతి కమిటీతో సమావేశమయ్యారు. ఈ నెల 16వ తేదిన మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా అదే రోజు గణేశ్‌ నిమజ్జనం ఉన్నందున ఎలాంటి సమస్యలు తలెత్తకుండా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధ్వర్యంలో ముస్లిం మత పెద్దలతో సమావేశాన్ని ఎర్పాటు చేయడం జరిగింది. వరంగల్‌ పోలీస్‌  కమిషనర్‌ సూచనల మేరకు 19వ తేదిన మిలాద్‌ ఉన్‌ నబీ ఉత్సవాలను నిర్వహించేందుకు ముస్లీం మత పెద్దలందరూ అంగీకరించడం జరిగింది. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ మాట్లాడుతూ  ప్రతి మతం వారు క్రమశిక్షణతో వ్యవహరిస్తూ వారి వారి పండుగలకు సంబంధించిన ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవడం వరంగల్‌ నగరవాసుల ప్రత్యేకతని,  మతసామరస్య విషయంలో వరంగల్‌ నగరంలో ఇతర ప్రాంతాలవారికి అదర్శంగా నిలుస్తోందని. ఇదే సంప్రదాయాన్ని భావితరాలవారికి అందజేయాలని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. కాజీపేట దర్గా పీఠాధిపతి ఖుస్రూ పాషా మాట్లాడుతూ వినాయక చవితి పండుగ వేళ మతసామరస్యంలో భాగంగా ఎంతోమంది ముస్లీం యువకులు గణేష్‌ విగ్రహాలను తయారి చేసి ఉచితం పంపిణీ చేయడం జరిగిందని. గణేష్‌ నిమజ్జన సందర్బంగా నిమజ్జనం కొసం తరలివేళ్ళే భక్తులకు మార్గమధ్యలో మంచినీరు, మజ్జిగను అందించడం జరుగుతుందని ఖుస్రూ పాషా తెలిపారు.ఈ సమావేశంలో వెస్ట్‌జోన్‌ డిసిపి రవీందర్‌, ఏసిపిలు జితెందర్‌రెడ్డి, నందిరాంనాయక్‌,దేవేందర్‌రెడ్డి,కిషోర్‌,తిరుపతితో పాటు ఇన్స్‌స్పెక్టర్లు పాల్గోన్నారు.

Related posts

చదివింది ఎం.బి.ఏ చేసేది సైబర్‌ నేరాలు

జాతీయ స్థాయికి ఎంపికైన అక్షయ్ కుమార్ కు అభినందన

Jaibharath News

8800002024 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇవ్వండి బిజెపిలో సభ్యులు అవ్వండి: