జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ బాలసముద్రంలోని గురుకుల్ దిస్కూల్ పాఠశాల సి. ఆర్. రావు 2024 వారు నిర్వహించిన ప్రతిభ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకును పదవతరగతి చదువుతున్న టి. ప్రతిభ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేయడం జరిగింది అనంతరం ప్రొఫెసర్ వెంకటరావు విద్యార్థులకు బహుమతులను అందచేశారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్లు, ప్రధానో పాధ్యాయురాలు సారిక ఉపాధ్యాయ బృందం అభినందించారు.
