జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 17 నర్సంపేట
తెలంగాణ రాష్ట్ర సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాల్సిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహా ఆవిష్కరణని వ్యతిరేకిస్తూ. తెలంగాణ తల్లి ఆత్మగౌరవని కించపరిచే విధంగా చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంగళవారం నర్సంపేట లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలవేసి పాలాభిషేకం చేసిన నర్సంపేట నియోజకవర్గం, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు.
ఈ కార్యక్రమంలో పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పిటిసిలు, పీఎస్ఎస్ చైర్మనులు, కౌన్సిలర్స్, నియోజకవర్గ నాయకులు, క్లస్టర్ బాధ్యలు తదితరులు పాల్గొన్నారు.
