*పెద్దమ్మగడ్డ దళితుల సమాదులను పరిరక్షించాలని పెద్దమ్మగడ్డ X రోడ్డు వద్ద ధర్నా చేస్తున్న దళితులకు మద్దతు తెలిపిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి*
హన్మకొండ//పెద్దమ్మ గడ్డ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 హనుమకొండ ప్రతినిధి:-
నిన్న ఎటువంటి అనుమతులు లేకుండా పెద్దమ్మగడ్డ దళితులు సమాదులను కూల్చి వేసిన అధికారులు.
ఎమ్మెల్యే కామెంట్స్…
దళితుల సమాదులను కూల్చుతుంటే చోద్యం చూస్తూ కొందరు మద్దతుగా నిలవడం చాలా దుర్మార్గమైన చర్య.
ఎన్నో ఏళ్లుగా వారు తమ భూముల పత్రాలు ఉన్న నిరక్ష్యారాశ్యత వలన మ్యుటేషన్ గాని, పట్ట చేసుకోవడం గాని చేయలేదు. ఇదే అధనుగా చేసుకుని కొందరు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని అన్యాయంగా కూలగొట్టారు. ఈ మేరకు వారి ధర్నాకు మద్దతు తెలిపి దోషులను చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో లా అండ్ ఆర్డర్ లేకుండా సమస్య నిర్ములన చేసేలా సీపీకి, రాష్ట్ర ముఖ్యమంత్రికి విషయం తెలియజేస్థానని అన్నారు.