జైభారత్ వాయిస్ న్యూస్ వద్దన్నపేట సెప్టెంబర్ 22
మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ తండ్రి బానోత్ కేవ్లా నాయక్ మృతిచెందారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఊకల్ గ్రామ శివారులోని బాలాజీ నగర్ తండాలో కొద్దిరోజులుగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నిన్న ఇంటివద్దే తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కేవ్లా నాయక్ మృతదేహాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే వెంట పరామర్శించిన వారిలో వరంగల్ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్, బిఆర్ఎస్ నాయకులు నిమ్మగడ్డ వేంకటేశ్వర రావు, దోనికెల మల్లయ్య తదితరులు ఉన్నారు.

previous post