Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

prajavani ప్రజావాణి వినతులను వెంటనే పరిష్కరించాలి-హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య

Public hearings should be addressed immediately-Hanumakonda District Collector Pravinya

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్23
హనుమకొండ: ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై అందించిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో ప్రజావాణి కార్యక్రమాన్ని వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వివిధ సమస్యలపై వినతి పత్రాలను జిల్లా కలెక్టర్ కు అందజేశారు. ప్రజల నుండి వినతి పత్రాలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ ఆయా శాఖల ఉన్నతాధికారులు ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించే విధంగా కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి 139 వినతులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై. వి. గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు వెంకటేష్, డాక్టర్ కె. నారాయణ, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేదకు లబ్ధి చేకూరేవిధంగా ఎంపిక జరగాలి

కేయూ దూరవిద్యా ప్రవేశాల గడువు సెప్టెంబర్-30సంచాలకులు వల్లూరి రామచంద్రం.

విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం