జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 23 హనుమకొండ, కిషన్ పురాలోని చైతన్య డిగ్రీ కాలేజ్ (సీడీసీ)లో నిర్వహిస్తున్న టెక్నోవిస్టా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి.జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం పెంపోదించడంలో ఈ కార్యక్రమం విద్యార్థులకు వేదిక అని ఎమ్మెల్యే అభివర్ణించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానంలో ప్రతి ఒక్కరు రానించాలి. ఈ కార్యక్రమం ద్వారా మీరు కూడా అన్ని రంగాల్లో ప్రతిభ చూపిస్తూ దేశ భవిష్యత్తులో ఉపయోగపడేలా చూడాలి. సాంకేతిక పరమైన ఇలాంటి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని, కళాశాల యాజమాన్యానికి ప్రత్యేక అభినందలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

next post