Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ సెప్టెంబర్ 24  హనుమకొండ జవహర్ లాల్  నెహ్రూ స్టేడియం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యువజన  క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా యువజనోత్సవాలు -2025 కార్యక్రమాన్ని  వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూసామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర పోషించే సమాజాన్ని స్వామి వివేకానంద ఊహించారు. మేధస్సును పెంపొందించడమే కాకుండా, నైతిక విలువలను పెంపొందించే విద్యను అందించడంలో అతను నమ్మాడని స్వామి వివేకానంద యువజన దినోత్సవం యువమనస్సులను వారి శక్తిని  అభిరుచిని నిర్మాణాత్మక  పరివర్తనాత్మక ప్రయత్నాల వైపు మళ్లించడానికి ప్రేరేపించడానికి ఒక వేదికగా ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. స్వామి వివేకానంద సిద్ధాంతాలను అనుసరించి ఎందరో గొప్పవారిగా ఎదిగారు. వారి సిద్ధాంతాలను ఆదర్శంగా తీసుకొని హనుమకొండ జిల్లా వేదికగా జరుగుతున్న ఈ క్రీడల్లో విద్యార్థులందరూ ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో హనుమకొండ జిల్లా ప్రత్యేక పేరు తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. వచ్చే ఏడాది నాటికి ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు (సమావేశాలకు) ఎంతో సుందరంగా నిర్మించుకున్న కాళోజి కళాక్షేత్రం వేదికగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. యువజానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు క్రీడాకారులందరికీ ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్, జిల్లా ఓలంపిక్ అసోసియేషన్  అధ్యక్షులు అజిజ్ ఖాన్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, గుంటి రజిత శ్రీనివాస్ మరియు జిల్లా క్రీడా శాఖ అధికారులు,క్రీడాకారులు, విధ్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పిల్లలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నేర్చుకోవాలి

ఆత్మకూరు లో 144 సెక్షన్ అమలు

Jaibharath News

సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలి