Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్

*చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా నివాళులర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్* 

వరంగల్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 వరంగల్ ప్రతినిధి:-

వరంగల్ తూర్పు నియోజక వర్గంలోని 28 వ డివిజన్, బట్టల బజారులో రజక సెల్ కన్వీనర్ కొత్తపల్లి రాజేష్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించిన బిజెపి జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అనంతరం మాట్లాడుతూ.. చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం సాయుధ పోరాటం చేశారని, నిజాం నవాబు, భూస్వాములు, జమీందార్లు, రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తి ప్రపంచానికి చాటిన నిప్పుకణిక మన తెలంగాణ వీర వనితని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి వీరవనిత చాకలి ఐలమ్మ గురించి పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని కోరారు. అనంతరం స్వీట్లు, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, రత్నం సతీష్ షా, జిల్లా ప్రధాన కార్యదర్శి బాకం హరిశంకర్, డివిజన్ అధ్యక్షులు రామని సుమన్, మహమ్మద్ రఫీ, బిజెపి నాయకులు పిట్ట చందు, శ్రీకాంత్, సదాశివుడు, రమేశ్, గణేష్, లక్ష్మణ్, పూర్ణచందర్, మరియు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జి ఎల్ ఎం పిఎస్ పాస్ పుస్తకాల ఆవిష్కరణ

Jaibharath News

గీసుకొండ మండలంలో 144 సెక్షన్‌ అమలు గీసుగొండ సిఐ. రామకృష్ణ

Jaibharath News

గణపతి నవరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్