*ఛలో హైదరాబాదును విజయవంతం చేయండి. జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్*
హన్మకొండ జిల్లా//పరకాల
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 26 పరకాల ప్రతినిధి:-
పరకాల పట్టణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సంధర్భంగా జిల్లా ఉపాధ్యక్షుడు మట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్.ఎఫ్.ఐ నిర్వహిస్తున్న ఛలో హైదరాబాద్ విద్యార్ది మహాగర్జనను జయప్రదం చేయాలని కోరారు పెండింగ్ లో ఉన్న 8 కోట్ల స్కాలర్షిప్ మరియు ఫీజు రియంబర్స్మెంట్ కాస్మోటిక్ చార్జీలు పెంచాలని సక్రమంగా ప్రతినెల డైట్ బిల్లలు చెల్లించాలని ప్రభుత్వ పాఠశాలల మూసివేత ఆపాలి అలాగే శిథిలావస్థకు చేరిన పాఠశాలలను మరమ్మత్తులు చేయాలని అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చరర్ పోస్టులను యూనివర్సిటీలో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులను నాన్ టీచింగ్ పోస్ట్లను వెంటనే భర్తీ చేయాలని పలు డిమాండ్లతో రేపు జరిగే ఛలో హైదరాబాద్ విద్యార్థి మహాగర్జనను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ జిల్లా కమిటీ సభ్యుడు హేమంత్ పట్టణ కార్యదర్శి సాయి తేజ ప్రభుత్వ కాలేజీ ప్రెసిడెంట్ యశ్వంత్ హరితేజ అన్వేష్ అఖిల్ రాకేష్ రోషర్ పాల్గొన్నారు.