Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి

*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి*

హన్మకొండ//కాజీపేట//సిద్ధార్థ నగర్

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 29 హనుమకొండ ప్రతినిధి:-

వరంగల్ పశ్చిమనియోజకవర్గం కాజిపేట పరిధిలోని 61వ డివిజన్ సిద్దార్థ నగర్ లో రూ. 22.60 లక్షలతో నిర్మించిన రాణి రుద్రమదేవి మహిళా భవనాన్ని (కమ్యూనిటీ హల్)ప్రారంభించిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. ఓరుగల్లు అంటేనే రాణి రుద్రమదేవి పౌరుషం పోటీ తత్వం గుర్తుకు వస్తుందని ఓరుగల్లు బిడ్డలుగా మహిళలందరూ అన్ని రంగాల్లో రాణించాలని, రాణి రుద్రమదేవి పోరాట పటిమను ఉనికి పుచ్చుకోవాలని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మహిళా సాధికారత లక్ష్యంగా ప్రభుత్వం ముందు వెళ్తుందని కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ కీలక శాఖలలో మంత్రులు, మేయర్, జిల్లా కలెక్టర్లు మున్సిపల్ కమిషనర్ మహిళలేనని గుర్తు చేశారు. రాణి రుద్రమాదేవి కమ్యూనిటీ హల్ అన్ని కార్యక్రమాలకు వేదిక కావాలని కోరుకున్నారు. ఈకార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ అబూబకర్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, శ్రవణ్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు రమేష్, సాగరిక రమాకాంత్, ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు సతీష్, హేమంత్ రెడ్డి, కాలనీ అధ్యక్షులు వాసుదేవ రెడ్డి, మహిళ మండలి విజయ లక్ష్మీ, మహిళా పుష్ప, భాను, గొట్టేముక్కుల స్వరూప, నీరజ, అరుణ రెడ్డి, భానుమతి, పండు రంగరావు, చంద్రావు, సత్యనారాయణ రావు మరియు అధికారులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భూభారతి చట్టంపై రైతులు, ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలి

సిడిఎంఏ వీపీ గౌతమ్ గ్రేటర్ వరంగల్ లో పర్యటన

భద్రకాళి చెరువు పూడికతీత పనులకు దేనికి ఎంత ఖర్చవుతుంది