Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర అక్టొబర్ 02
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగంపై నిషేధం విధిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారని దామెర ఎస్సై అశొక్ తెలిపారు.డీజేల నుంచి ఉత్పన్నమయ్యే అధిక డెసిబెల్స్ కారణంగా ప్రజలు, ముఖ్యం గా వృద్ధుల ఆరోగ్యం దెబ్బతింటుందనే కారణం తో ఇకపై వరంగల్ కమిషనరేట్ పరిధిలో మతపరమైన ఊరేగింపుల్లో డి. జే సౌండ్ మిక్సర్లు, యాంప్లిఫయర్, బాణాసంచా ఉపయోగించడాన్ని నిషేధిస్తూ పోలీసు కమిషనర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిషేధ ఉత్తర్వులను ఎవరైనా అతిక్రమిస్తే ఐదేళ్లు జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా ఉంటుందన్నారు

Related posts

మాట నిలబెట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం!-సంబరాల్లో కాంగ్రెస్ నేతలు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

రాష్ట్రంలో రాబోయేది.. బీజేపీ ప్రభుత్వం

జాతర సేవకు ఆర్ట్స్ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు!

Jaibharath News