Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టొబర్ 02
మహాత్మా గాంధీ 155 వ జయంతి సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓ స్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ నగరంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ అహింస యుతముగా మహాత్మా గాంధీ సాధించిన స్వాతంత్రోద్యమ ఫలితాల ద్వారానే మనమందరం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నామని కొనియాడారు .అదేవిధంగా అందరూ మహాత్మాగాంధీని ఆదర్శంగా తీసుకొని తన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గాదె వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, కేంద్ర సంఘ కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు ,సహాధ్యక్షులు హేమ నాయక్, జిల్లా బాధ్యులు సత్యనారాయణ, చిరంజీవి ,సందీప్, నాగేశ్వరరావు, భాను ప్రకాష్ తదితర జిల్లా సంఘ నాయకులు పాల్గొన్నారు.

Related posts

కుమ్మరులకుఅన్ని రాజకీయ పార్టీలు చట్ట సభల్లో ప్రతినిధ్యం కల్పించాలి

Jaibharath News

వైస్సార్ 15వ వర్ధంతి సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు, కుడా చైర్మన్, డీసీసీ అధ్యక్షురాలు

ప్రపంచం మొత్తం భారతదేశం వైపే చూస్తుంది…కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య పి మల్లారెడ్డి