జైభారత్ వాయిస్ న్యూస్ వర్ధన్నపేట అక్టోబర్ 3 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లిమిటెడ్ పర్వతగిరి మండలం చౌటపల్లి గ్రామంలో భవన నిర్మాణం మరియు 500 మెట్రిక్ టన్నుల రెండు గోదాములను పంచాయతీ రాజ్, గ్రామీనాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిధిగా పాల్గొని ప్రారంభించారు. ఈరోజు కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, చైర్మన్లు మార్నేని రవీందర్ రావు, జంగా రాఘవ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎర్రబెళ్లి స్వర్ణ మరియు చైర్మన్లు ఇతరులు పాల్గొన్నారు.