Jaibharathvoice.com | Telugu News App In Telangana
భక్తి సమాచారం

ఆత్మకూరులో పంచ కూట శివాలయం ప్రతిష్టకు సన్నాహాలు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
కాకతీయుల కాలంలో నిర్మించిన పంచ కూట శివాలయాన్ని ఆత్మకూరు మండల కేంద్రంలో అద్భుతంగా రాతి కట్టడంతో తిరిగి నిర్మించారు.ఆలయ ప్రతిష్టకు సన్నాహాలు చేస్తున్నారు. భారత దేశంలో నే  పంచ కూట శివాలయం లు అరుదుగా వున్నాయి. అందులో ఆత్మకూరులో నెలకొన్న పంచ కూట శివాలయం మహిమాన్విత మైందని ప్రతీతి. దాదాపు 11 వ శతాబ్దంలో  అప్పటి కాకతీయ రాజులు నిర్మించిన ఆలయం పంచ లింగాల తో కూడుకొని వుంది. వందల ఏళ్లు గా శివాలయం శిధిలావస్థలో వుంది. కాకతీయ రాజులు, జగద్గురువులు, సామంతులు  మహా శివునికి ప్రత్యేక పూజలు చేశారని స్థల పురాణం లో వుంది.ఈ  శివాలయాన్ని గ్రామస్తులు పునర్ నిర్మించు కోవాలనే వుద్దేశ్యం తో కమిటీ ఏర్పాటు చేసుకుని గత ఐదేళ్లుగా శ్రమించారు. ప్రజలు, భక్తులు,ఇచ్చిన విరాళాలతో  అద్భుతంగా పునర్ నిర్మించారు. అంటే విశ్వం లోని పంచ భూతాలైన భూమి , వాయు, నీరు, అగ్ని, ఆకాశం లకు ప్రతీకగా నిర్మించి న ఆలయాన్ని ప్రతిష్ట చేయనున్నారు. తమిళ నాడు రాష్ట్రానికి చెందిన స్థపతులు నిర్మించారు. సిమెంట్,తదితర వాటిని వాడకుండా శ్రీపార్వతి దేవి సహిత మహా దేవుని దేవాలయం రాతి కట్టడంతో నే నిర్మాణం సాగింది. నాటి కట్టడాలకు తీసిపోకుండా శిల్ప  ఉట్టి పడుతున్నది . ప్రధాన ద్వారం లోపల గర్భ గుడిలో శివలింగాన్ని ప్రతిష్టించారు. గర్భ గుడికి కుడి వైపు రెండు శివ లింగాలను ,ఎడమ వైపుల మరో రెండు శివ లింగాలను ప్రతిష్టించడా నికి ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అలాగే పార్వతీదేవి, నంది, వినాయకుడు, కుమారస్వామి, విగ్రహాలను ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. భారత దేశం లో ఎక్కడ లేని విధంగా మహా దేవ ఆలయ ప్రతిష్ట ఈ నెల 6, 7, 8 లలో ఉత్సవాలు జరుపుతున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయంలో ధ్వజ స్తంభం ఏర్పాటు, నవ గ్రహ విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఆలయ పునః ప్రతిష్ట ఉత్సవాలకు జిల్లా కలెక్టరు, పరకాల ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి,తో పాటు పోలీసు అధికారులను  ఆహ్వానించినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.

Related posts

కన్నుల పండుగగా భద్రాచలం శ్రీ సీతారామ స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం

నమస్తేస్తు మహామాయేశ్రీ పీఠే సుర పూజితేశంఖ చక్ర గదా హస్తెమహాలక్ష్మీ నమోస్తుతే

వేములవాడ రాజన్నను దర్శించుకున్న ప్రధాని మోది.