Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్ర  స్థాయి యోగ పోటీలు ముగింపు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ నవంబర్ 7)
గ్రేటర్ వరంగల్ నగరంలో స్కూల్స్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర స్థాయి 17 సంవత్సరాల బాల బాలికల యోగా  ఆసనముల పోటీలు గురువారం రోజున  కెమిస్ట్రీ  డ్రగ్గిస్ట్ భవనం  వరంగల్ నందు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్  సెక్రటరీ దస్రూ నాయక్,   రాష్ట్ర యోగా కన్వీనర్ మహమ్మద్ ఇమ్రాన్., యోగా జిల్లా కన్వీనర్ బొలిశెట్టి కమలాకర్, ఫిజికల్ డైరెక్టర్లు కుండే కిరణ్, పాకాల రవీందర్ శ్రీనివాస్, సోమన్న ,   మహమ్మద్.పాషా  తదితరులు పాల్గొన్నారు.   రాష్ట్ర స్థాయికి ఎంపికైన యోగ క్రీడాకారులు పోటీలలో గెలుపొందిన బాలికల ఛాంపియన్షిప్ లో వరంగల్ మొదటి ఛాంపియన్ షిప్ నిజాంబాద్ ద్వితీయ ఛాంపియన్స్ షిప్,కరీంనగర్
తృతీయ ఛాంపియన్షిప్ గా  నిలిచారు బాలుర  విభాగంలో వరంగల్ ప్రథమ చాంపియన్షిప్  మహబూబ్ నగర్ ద్వితీయ ఛాంపియన్షిప్  కరీంనగర్ తృతీయ ఛాంపియన్  నిలిచారు.ఈ పోటీలో ఎంపికైన క్రీడాకారులు ఈ నెల  చివరి వారంలో జరిగే జాతీయస్థాయి యోగా పోటీల్లలో మన  తెలంగాణ జట్టు  పాల్గొంటారని సెక్రెటరీ దస్రూ నాయక్ తెలిపారు

Related posts

గీసుకొండలో  శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవం

లయన్స్ క్లబ్ అధ్వర్యంలో వినాయక మట్టి విగ్రహములు పంపిణి

Jaibharath News

దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి