(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 23)
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రభుత్వ పాఠశాలలో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏ విధంగా అమలవుతున్నది అనే తీరు పైన వరంగల్ మండలంలోని మట్టేవాడ,గిర్మాజీ పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికతనికి నిర్వహించడమైనది. ఈ ఆకస్మిక తనిఖీలో భాగంగా మట్టేవాడ హై స్కూల్, గిర్మాజిపేట హైస్కూల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరించేందుకు పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కంప్లైంట్స్ బాక్స్ ను జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. అందులో ఉన్న కంప్లైంట్స్ ని జిల్లా కలెక్టర్ స్వయంగా పరిశీలించి అందులో విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం లో ఆహార విషయంలలో సరిగా వండడం లేదని, వచ్చిన కంప్లైంట్స్ ని పరిశీలించి అందుకు గల కారణాలను పరిశీలించవలసిందిగా డిఈఓ జగదీశ్వర్ ను అదేశించడమైనది. ఈ ఆకస్మిక తనిఖీ లో జిల్లా కలెక్టర్ పాఠశాలల్లో మౌలిక వసతులు పరిశీలించి పాఠశాలల్లో చుట్టు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడానికి గమనించి చుట్టు పరిసరాలలో శుభ్రంగా ఉండేలా చూడాలని పాఠశాల ప్రిన్సిపాల్ ను అదేషించడమైనది.పాఠశాల పరిసర ప్రాంతాలలో నీటి ట్యాంక్ లీకేజీని గమనించి లికేజిని అరికట్టుటకు నివేదికలు సమర్పించి నీటి వృదను అరికట్టాలని సూచించారు.పాఠశాల క్లాస్ రూమ్లను పరిశీలించి విద్యార్థులతో వారి భవిష్యత్తు లో మీరేం అవ్వాలనుకుంటున్నారు అనే అంశం పై పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచనల పైన పిల్లలతో సంభాషించారు.పాఠశాలలోని వంటగదిని, వంట సామాగ్రి నిల్వలు గదిని పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు.ఈ రోజు పిల్లల కోసం తయారు చేసిన మధ్యహ్నం భోజనం ను పరిశీలించారు.పిల్లలకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్టిక ఆహారాన్ని అందించుటకు కృషి చేయాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.ఈ ఆకస్మిక తనిఖీల్లో వరంగల్ తాహాసిల్దార్ ఇక్బాల్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యజమాన్యం వారి వెంట ఉన్నారు.
