Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రైమ్ వార్తలు

డీజీపీ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్న వరంగల్‌ పోలీస్‌ అధికారులు

(జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్23)
వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్‌ అధికారులు రాష్ట్ర పోలీస్‌ డీజీపీ జితేందర్‌ చేతుల మీదుగా ప్రశంస పత్రాలు అందుకున్నారు. ప్రశంస పత్రాలు అందుకున్న పోలీస్‌ అధికారులు గతంలో పనిచేసిన పోలీస్‌ స్టేషన్ల పరిధిలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను నియంత్రించడంతో పాటు, గంజాయి అక్రమ రవాణాకు పాల్పడిన నేరస్థులకు పది సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడటంలో కృషి చేసినందుకుగాను హైదరాబాద్‌ పోలీస్‌ శాఖ ప్రధాన కార్యాలయములో ఏర్పాటు చేసిన కార్యక్రమములో రాష్ట్ర పోలీస్‌ డీజీపీ చేతుల మీదుగా వరంగల్‌ పోలీస్‌ కమిషరేట్‌కు చెందిన పోలీస్‌ అధికారులు ప్రశంస పత్రాలను అందుకున్నారు. ప్రశంస పత్రాలు అందుకున్న వారిలో కెయూసి ఇన్స్‌స్పెక్టర్‌ రవికుమార్‌, సుబేదారి ఇన్స్‌స్పెక్టర్‌ సత్యనారాయణ రెడ్డి, సంగెం ఎస్‌.ఐ నరేష్,మీల్స్‌కాలనీ హెడ్‌కానిస్టేబుల్‌ సుధాకర్‌ వున్నారు. ఈ సందర్బంగా ప్రశంస పత్రాలను అందుకున్న పోలీస్‌ అధికారులను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

Related posts

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు

హశిష్ మత్తు మందుతో పోలీసులకు పట్టుబడిన అంతర్ రాష్ట్ర స్మగ్లర్

ముందస్తూ చర్యలతో వరంగల్‌ కమిషనరేట్‌లో నేరాల అదుపు వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా