(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు ):ఆత్మకూరు శ్రీ విఘ్నేశ్వర భవన నిర్మాణం తాపీ మేస్త్రిల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఏకగ్రీవంగా నూతనకమిటీ ఎన్నిక జరిగింది.ఆత్మకూరు తాపీ మేస్త్రి ల సంఘం సోమవారం పోచమ్మ సెంటర్ లో జరిగిన సమావేశం లో అధ్యక్షులు గా మంద రవి, ప్రధాన కార్యదర్శి గా గోల్కొండ వెంకన్న, ఉపాధ్యక్షులు గా బింగి రవి, పొదిల సదయ్య, సంయుక్త కార్యదర్శి గా సంగే రాజు, కోశాధికారిగా మంద ప్రేమ్ లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా అధ్యక్షులు రవి మాట్లాడుతూ
50 ఏళ్లు దాటినా మేస్త్రిలకు రెండు వేల రూపాయలు పింఛన్ లు అంద జేయాలని డిమాండ్ చేశారు .గత ప్రభుత్వం మేస్త్రిల కు ఉచిత మోటార్ సైకిల్ లను ఇస్తానని ఇవ్వకుండా దాట వేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఇవ్వాలని కోరారు. గత ప్రభుత్వం మేస్త్రిలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం హయాంలో తాపీ మేస్త్రిల స్థితి గతులు బాగలేవని ,రెక్కడితే డొక్కానిండని బ్రతుకులు పేద లుగా మారి ఎంతో మంది జీవనం గడుపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కూలీ చేస్తేనే జీవనం గడుతున్నదని వాపోయారు. దారిద్ర్యానికి దిగువన వున్న తాపీ మేస్త్రిల ను ఆదు కోవాలని అధికారులను ఆయన కోరారు. ఈ కార్యక్రమం లో ఆత్మకూరు తాపీ మేస్త్రిలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

next post